---Advertisement---

జగన్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చాం – లోకేశ్

Jagan Given Z+ Security – Lokesh Clarifies
---Advertisement---

ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలు పెంచుకునే ప్రసక్తే లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రికి ఉన్నదానికంటే ఎక్కువగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని తెలిపారు.

ప్రజాస్వామ్యంలో చట్టసభల ప్రాముఖ్యత

స్పీకర్‌పై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరమని, ప్రజాప్రతినిధులు ప్రజల తరపున చర్చ జరిపి సమస్యలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని లోకేశ్ అన్నారు. “ఎవరు అధికారంలో ఉన్నా చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుంది” అని చెప్పారు.

వైసీపీ వైఖరిపై లోకేశ్ విమర్శలు

తాము అధికారంలో లేని సమయంలో కూడా శాసనసభలో నిరసనలు ప్రదర్శించామని, కానీ అప్పటి వైసీపీ వైఖరికి, ప్రస్తుత వైఖరికి తేడా ఉందని పేర్కొన్నారు. గతంలో వైఎస్ జగన్ సభలో చంద్రబాబు నాయుడిపై “23 మంది సభ్యులు ఉన్నారు, ఐదుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు” అన్న వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని స్పష్టం

“ప్రతిపక్షం హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ఎలాంటి అవరోధాలు కలిగించదు” అని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించడం, అసెంబ్లీలో అనవసర రాద్ధాంతం చేయడం ప్రజాస్వామ్యానికి హాని కలిగిస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. స్పీకర్ హోదాపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చే చర్య అని విమర్శించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment