---Advertisement---

వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియాకు అండగా కొత్త టాస్క్ ఫోర్స్?

---Advertisement---

సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా నిల్చేందుకు పార్టీ బృందాలు ఏర్పాటు. అక్రమ నిర్భంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు మరింత అండగా ఉండేందుకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అ«ధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరపున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడమైంది. అక్రమ నిర్భంధాలకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడంతో పాటు, వారికి భరోసా ఇవ్వడం, వారిని పరామర్శిస్తూ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం పార్టీ బృందాలు పని చేస్తాయి.

ఆయా జిల్లాల్లో పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్‌సెల్‌ ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బృందం పని చేస్తుంది.జిల్లాలవారీగా పార్టీ బృందాలు వివరాలు:

శ్రీకాకుళం :సీదిరి అప్పలరాజు, శ్యామ్‌ప్రసాద్‌

విజయనగరం :బెల్లాని చంద్రశేఖర్, జోగారావు

.వి«శాఖపట్నం :భాగ్యలక్ష్మి, కెకె రాజు.

తూర్పు గోదావరి : జక్కంపూడి రాజా, వంగా గీత

పశ్చిమ గోదావరి :కె.సునిల్‌కుమార్‌ యాదవ్, జయప్రకాష్‌ (జేపీ)

కృష్ణా :మొండితోక అరుణ్‌ (ఎమ్మెల్సీ), దేవభక్తుని చక్రవర్తి

గుంటూరు :విడదల రజని, డైమండ్‌ బాబు

ప్రకాశం :టీజేఆర్‌ సుధాకర్‌బాబు, వెంకటరమణారెడ్డి

నెల్లూరు :రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పి.చంద్రశేఖర్‌రెడ్డి (ఎమ్మెల్సీ)

చిత్తూరు :గురుమూర్తి (ఎంపీ), చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి

అనంతపురం :కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్‌గౌడ్‌

కడప :సురేష్‌బాబు, రమేష్‌యాదవ్‌

కర్నూలు :హఫీజ్‌ఖాన్, సురేందర్‌రెడ్డి (ఆలూరు).

–వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంతాడేపల్లి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment